ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. చంద్రబాబు ఆమెను అత్తా అని ఓ సారి పిలిచారట. అంతే కాదు.. ఓ విషయంలో తన కొడుకు లోకేశ్ పై ఒట్టేసి మరీ లక్ష్మీ పార్వతి ముందు ప్రమాణం చేశారట. మరి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది.. పూర్వాపరాలేంటి చూద్దాం..

CHANDRABABU AND LAKSHMI PARVATHI కోసం చిత్ర ఫలితం


1993 కర్నూలు ఉప ఎన్నికలో టిడిపి ఓటమికి చంద్రబాబే యత్నించారని ఫిర్యాదు వచ్చిందట. దీంతో కోపం వచ్చిన ఎన్టీఆర్ చంద్రబాబును పార్టీలోనే ఉండవద్దని చెప్పారట. దాంతో ఎన్.టి.ఆర్.ను తిరిగి ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు ప్రముఖ లాయర్ రామచంద్రరావు ద్వారా లక్ష్మీపార్వతి వద్దకు వచ్చారట.

సంబంధిత చిత్రం


చంద్రబాబును తనను బతిమిలాడి.. ఆ సందర్భంగా అత్త అని కూడా సంభోదించారట. అయితే పార్టీకి ద్రోహం చేయనని ఒట్టు వేయాలని లక్ష్మీపార్వతి కోరిందట. అందుకు చంద్రబాబు సమ్మతించారని , అత్త అయినా..అమ్మ అయినా మీరే కదా..కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నానంటూ ఒట్టేశారట. ఎన్.టి.ఆర్.కు నష్టం చేయనని ప్రమాణం చేశారట.

సంబంధిత చిత్రం


కాని ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు ఆ ప్రమాణాలు, ఒట్లు తీసి పక్కన బెట్టి స్వయంగా మామ అయిన ఎన్.టి.ఆర్.కే వెన్నుపోటు పొడిచారని లక్ష్మీపార్వతి అంటున్నారు. చంద్రబాబు దీనిని కాదనగలరా అని లక్ష్మీపార్వతి సవాల్ చేశారు. మరి ఈ విషయంలో నిజానిజాలేంటో వారిద్దరికే తెలియాలి కదా..


మరింత సమాచారం తెలుసుకోండి: