తెలంగాణలో ఎన్నికలకు ముందు కేసీఆర్ యాగం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ యాగం చేసింది లోక కల్యాణం కోసమని చెబుతారు. ఏదేమైనా ఆయన మళ్లీ సీఎం కావడంలో యాగం ఎఫెక్టు కూడా ఉందని చాలా మంది నమ్ముతుంటారు. యాగాలపై ఉన్న నమ్మకం అలాంటిది.

swami swarupanandendra కోసం చిత్ర ఫలితం


కానీ ఇప్పుడు ఓ స్వామీజీ చంద్రబాబు పదవి పోయేందుకు యాగం చేస్తారట. మరి చంద్రబాబుపై అంత కోపం ఎందుకంటారా... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారస్థాయికి చేరిందట. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన లోపభూయిష్టంగా మారిందట. ఈ ఆరోపణలన్నీ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివి.

సంబంధిత చిత్రం


ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయట. వాటికి సంబంధించిన ప్రతి ఆధారం తన వద్ద ఉందట. త్వరలో వాటిని మీడియా ముందు పెడతారట. అంతే కాదు.. టీటీడీ అధికారులు, ముఖ్యమంత్రిపైన కేసు కూడా పెడతారట ఈ స్వామీజీ. అక్కడితో ఆగిపోతారా..

సంబంధిత చిత్రం


ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మార్పు కోసం త్వరలో రాజశ్యామల యాగం కూడా చేస్తానని కుండబద్దలు కొడుతున్నారీ స్వామీజీ. అంతే కాదు.. తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి రావడానికి కారణం తాను దగ్గర ఉండి నిర్వహించిన రాజశ్యామల యాగమే కారణమట. మరి ఎందుకైనా మంచిది చంద్రబాబు దీనికి విరుగుడు ఆలోచించుకోవాలేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: