రాజకీయంగా సంచలనం రేపుతున్న జగన్ తో నాగార్జున భేటీ. నాగార్జునకు వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు. అక్కినేని నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ చేపట్టబోయే బస్సు యాత్రలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారా లేకుంటే రాజకీయ పరమైన చర్చలు ఏమైనా జరుగుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది. నిన్న మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఆ మద్య మంచు విష్ణు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిన కలిసిన విషయం తెలిసిందే. తాజాగా నాగార్జున కలవడం రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.