తెలుగు దేశం నుంచి వైసీపీకి వలసలజోరుకు ఇప్పట్లో అడ్డుకట్టపడేలా లేదు. నాయకులు వరుసగా లోటస్ పాండ్ కు క్యూ కడుతూనే ఉన్నారు. చంద్రబాబు ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా.. ఈజోరును మాత్రం అడ్డుకోలేకపోతున్నారనే అసంతృప్తి టీడీపీ అభిమానుల్లో కనిపిస్తోంది.



ఇక తాజాగా.. తెలుగుదేశం నుంచి ఇప్పుడు మరో వికెట్ పడబోతోంది. ఆయనే.. తెలుగుదేశం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి. ఈయన తెలుగుదేశానికి గుడ్ బై చెప్పబోతున్నారని... వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని.. చంద్రబాబు అనుకూల పత్రిక కథనం ఇవ్వడం విశేషం.

modugula venugopala reddy కోసం చిత్ర ఫలితం


అయితే ఇచ్చే వార్త టీడీపీకి వ్యతిరేకం కనుక... దాన్ని సాధ్యమైనంతగా టీడీపీకి అనుకూలంగా మార్చి కథనం ఇచ్చింది. మోదుగుల సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నారని.. దానిపై వైసీపీలో తర్జనబర్జన జరుగుతోందని ఆ పత్రిక రాసింది. అంతే కాదు.. టీడీపీలో మోదుగులకు టిక్కెట్ ఇవ్వడం లేదని అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని కూడా రాసింది.

సంబంధిత చిత్రం


ఒకసారి ఎంపీగా మరో సారి ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల తీరు వివాదాస్పదం అంటూ కలరింగ్ ఇచ్చింది. ఆయన వైఎస్సార్ అభిమాని అని అభిప్రాయం వచ్చేలా వార్త రాసిందిరెడ్డి కులస్తుడు కాబట్టి... తమ నియోజకవర్గం నుంచి రెడ్డినే గెలిపించుకోవాలని ఆయన గతంలో అన్న విషయాన్ని ప్రస్తావించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: