ఓటుకు నోటు కేసు ఇప్పుడు ఏపీ సీఎంను ఇబ్బంది పెడుతోందా.. ఈ కేసులో తనకు నోటీసు వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారా.. ఎన్నికల సమయంలో తనను ఇబ్బందిపెట్టాలని ప్రత్యర్థులు మోడీ, కేసీఆర్ కుట్రపన్నుతున్నారని చంద్రబాబు ఫీలవుతున్నారా.. అంటే అవుననే చెప్పాలి.



ఓటుకు నోటు కేసులో తనకు కూడా నోటీసులు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు కూడా నోటీసులు రావచ్చని ఆయన అన్నట్టుగా తెలుగుదేశం సొంత మీడియాలోనే వార్తలు రావడం విశేషం.



ఎన్నికల వేల తనను టార్గెట్ చేసేందుకే రేవంత్ రెడ్డి కేసును బయటకు తీశారని ఈడిని రంగంలోకి దించారని చంద్రబాబు అంటున్నారు. తనను లక్ష్యంగా చేసుకునే ఈ కేసు జరుగుతోందని, తనకు కూడా నోటీసు రావచ్చని ఆయన అన్నారట. తమ పార్టీకి చెందినవారికి పలు శాఖల నుంచి కేసులు వస్తున్నాయని ఆయన చెబుతున్నారు.



అయితే.. వీటిని ఎదుర్కుంటామని ఆయన చెబుతున్నారు. అంతే కాదు.. ఓటుకు నోటు కేసును హైకోర్టు కొట్టివేసిందని కూడా చంద్రబాబు అన్నారట. ఓవైపు ఈ కేసులో విచారణ జరుగుతుండగానే ఈ కేసు కొట్టేసిందని బాబు చెప్పడం ఏంటో.. ఓ కేసులో కొట్టేసినా.. మరో కోణంలో కేసు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: