ఏపీలో రాజకీయ నాయకుల విమర్శలకు అడ్డూఅదుపూలేకుండా పోతోంది. ఎదుటి పార్టీని విమర్శించడం ఒక్కటే లక్ష్యం.. ఆ విమర్శలు జనం నమ్ముతారా లేదా.. విమర్శల్లో ఏమైనా లాజిక్ ఉందా లేదా అన్నది నాయకులకు ఏమాత్రం పట్టకుండా ఉంది. తాజాగా జగన్ లండన్ పర్యటనపై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన విమర్శ అలాగే ఉంది.

jagan meet vijay mallya కోసం చిత్ర ఫలితం


లండన్ కు వెళ్లిన జగన్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో రహస్యంగా భేటీ అయ్యారని వెంకన్న ఆరోపించారు. ఎన్నికల కోసం హవాలా డబ్బును భారత్ కు తరలించేందుకే ఈ సమావేశం జరిగిందని విమర్శించారు. ఈ భేటీ వివరాలను జగన్ బయటపెట్టాలని కూడా వెంకన్న డిమాండ్ చేశారు.

సంబంధిత చిత్రం


రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిధుల కోసమే జగన్ మాల్యాతో సమావేశం అయ్యారని ఆరోపించారు. జగన్ లండన్ పర్యటనలో ఎవరెవరిని కలిశారో చెప్పాలన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనీ, ఏపీలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.

buddha venkanna కోసం చిత్ర ఫలితం


జగన్ వంటి ప్రతిపక్షనేత ఓ ఆర్థిక నేరగాడితో కలిసారని విమర్శించాలంటే .. దానికి ఏదైనా ఆధారం ఉండాలి. కేవలం ఇద్దరూ లండన్‌లో ఉన్నారు కాబట్టి ఏమైనా విమర్శించొచ్చు అనే తరహా రాజకీయం మెప్పించదు. ఈ విమర్శలను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. బుద్దా వెంకన్న మాల్యా, జగన్ భేటీని బహుశా సీఎం డ్యాష్ బోర్డులో చూశారేమో అని సెటైర్లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: