ఆయన ఏపీకి ఉపముఖ్యమంత్రి.. అంతే కాదు.. ఏపీ హోం మంత్రి కూడా.. కానీ ఆయన ఓ ఉత్సవ విగ్రహం మాత్రమేనని చాలామంది మీడియా విశ్లేషకులు అంటుంటారు. ఆయన చాలా ప్రెస్ మీట్లలో తడబడుతుంటారు. పెద్దగా విషయం కూడా ఉండదు. అలాంటి చినరాజప్ప.. కొత్త వాదనలో జనం మతి పోగొడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా ఏమాత్రం లీక్ కాలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రజలను అనవసర గందరగోళానికి గురి చేస్తోందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అబ్బే .. ప్రభుత్వ డేటా లీక్ కాలేదు.. తెలుగుదేశం పార్టీ డేటా లీక్ అయ్యిందేమో అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డేటా లీక్ కాలేదు కాబట్టే తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు.
అంతే కాదు.. అసలు ఏపి డేటా లీక్ అయినట్లు తెలంగాణ వాసి ఫిర్యాదు చేయడమేమిటని చినరాజప్ప ప్రశ్నించారు. మా ప్రభుత్వ వ్యహారం పై తెలంగాణ ప్రభుత్వం సిట్ వేయడమేనిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు దమ్ముంటే ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలవాలని సవాలు విసిరారు.