ఒకప్పుడు దొంగలు ఇళ్లలో పడి దోచుకునే వారు..కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరాలకు పాల్పపడుతూ ఉన్నచోటే గుల్ల చేస్తున్నారు.  ముఖ్యంగా మల్టీ లేవల్ మార్కెట్ లలో ఎన్నో స్కామ్ లు బయటపడుతున్నారు.  ఇందులో చదువుకున్న వారు సైతం దారుణంగా మోసపోతూ లక్షలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. 

తాజాగా హైదరాబాద్ లో బయటపడ్డ మరో మల్టీ లేవల్ మార్కెట్ స్కాం బయట పడింది.  ఈ బిజ్ పేరు తో భారీ మోసానికి తెగబడ్డారు.  సంస్థలో రూ.16వేలు కట్టి సభ్యులుగా చేరితే 10వేల పాయింట్లు ఇస్తారు. సభ్యులుగా చేరిన ప్రతి వ్యక్తికీ కమీషను రావాలంటే మరో ఇద్దరిని చేర్పించాలని నిబంధన పెట్టారు. యువతను ఆకట్టుకొనేందుకు ఈ లెర్నింగ్‌ కోర్సు అని చెబుతారు.  సభ్యులకు కంప్యూటర్‌ కోర్సు,  58 రకాల ఇతర కోర్సులు నేర్పిస్తామని చెబుతారు. రెండు నెలల తర్వాత క్విజ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి కోర్సు పూర్తయ్యాక 50శాతం మార్కులు వస్తే సర్టిఫికెట్ ఇస్తారు. 

ఇలా ఎంతో మందిని ఆకర్షించి 7 లక్షల మంది నుంచి రూ. వెయ్యి కోట్ల వరకు వసూలు చేసిన ఈ బిజ్. దీనికి సంబంధించి హైదరాబాద్ లోని సైబారాబాద్ పోలీస్ లకు జగిత్యాలకు చెందిన సామల్ల వివేక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 2001లో ఈ-బిజ్ ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా కేంద్రంగా నడుస్తోందని… సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.  ఈ-బిజ్ నిర్వాహకుడు హితిక్ మల్హాన్ ను అరెస్ట్ చేశారు.  ఈబిజ్ కు చెందిన 70 ఆస్తుల్ని సీజ్ చేసిన సైబరాబాద్ పోలీసులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: