సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే మహా అంటే 80% ఓటింగ్ అంటే చాలా సక్సెస్ గా ఎన్నికలు ముగిసినట్టే లెక్క. ఈ మద్య కాలంలో భారత దేశ వ్యాప్తంగా మినిమం 50% అంటే చాలా గొప్పగా జరిగిందని భావిస్తున్నారు. కానీ ఒక దేశంలో మాత్రం ఏకంగా 99.99 ఓటింగ్ శాతం నమోదైంది. నిజంగా చెప్పాలంటే ఇది చాలా వింతే..ఉత్తర కొరియాలో ఈ సంఘటన జరిగింది.
గతంలో 99.97 శాతంతో ఉన్న రికార్డు ఇప్పుడు మాయమైంది. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ (ఎస్పీఏ)గా పిలిచే పార్లమెంటుకు అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో ఈ వింత చోటు చేసుకుంది. ప్రతీ ఐదేళ్లకోసారి దేశవ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికలు కిమ్ జోంగ్ ఉన్ తన చెప్పు చేతల్లో ఉంచుకుంటారన్న విషయం తెలిసిందే.
ప్రతీ ఓటింగ్ స్లిప్లోనూ ఒకరి పేరు ఉంటుంది. ప్రజలందరూ చచ్చినట్టు అతడికే ఓటు వేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ సారి వందశాతం ఓటింగ్ జరగాల్సి ఉండగా కిమ్ ఓటింగ్లో పాల్గొనకపోవడంతో అది మిస్సయింది.