టివి9, ఏబీఎన్,టివి 5, మహాన్యూస్ ఇవన్నీ మరికొన్ని వార్తా సంస్థలు టీడీపీ కోసమే పని చేస్తున్నాయి మన పోరాటం ఒక్క టీడీపీతోనే కాదు ఈ ఎల్లో మీడియాతో కూడా... కొంత కాలం క్రితం తమ కార్యకర్తలు, సానుభూతి పరులతో  వైఎస్ జగన్ అన్న మాటలివి.  వైఎస్ వివేకా హత్యోదంతను రిపోర్టు చేయడంలో పైన చెప్పిన మీడియా సంస్థలు తడబడుతున్నట్లు కనిపిస్తున్న పరిస్తితి.


 హత్యానంతరం పరిస్థితిని పులివెందుల నుండి కవర్ చేయాలా లేక ఇది జగన్ ఆడుతున్న నాటకం అని చెబుతున్న టీడీపీ పెద్దల ప్రెస్ మీట్ లకు లైవ్ ఇవ్వాలా..అస్సలు ఏ లైన్ తీసుకోవాలనే మదనమే ఈ మీడియా సంస్థల కవరేజ్ లో కనిపిస్తుంది.


హత్యలు ఎవరు - ఎక్కడ-ఎప్పుడు -ఎలా చేసినా సమాజం హితం కోరి ాటిని నిరభ్యంతరంగా ఖండిస్తూ..ఖచ్చితమయిన నిజాలను రిపోర్ట్ చేయవలసిన మీడియా ఇలా తమ లైన్ ఏమిటి-ఎవరికి -ఏమిటి అన్నట్లు ఉన్నారనుకుంటున్నారు సామాన్య ప్రజానీకం. 


మరింత సమాచారం తెలుసుకోండి: