మా చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ని అత్యంత కిరాతకంగా, దారుణంగా పథకం ప్రకారం హతమార్చారన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  ముప్పైఏళ్ల సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నాయకుడు..ఎంతో సౌమ్యుడు అని పేరు తెచ్చుకున్న వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేస్తే ఆ ఉదంతం మొత్తాన్ని చాప చుట్టేయడానికి ఏపి ప్రభుత్వం, పోలీసు బాసులు పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారన్నారాయన.


వైఎస్ కుటుంబంలో హత్యలన్ని చంద్రబాబు హయాంలోనే జరిగినవేనని..చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తాత వైఎస్ రాజారెడ్డిని దారుణంగా హత్య చేసిన హంతకులను టీడీపీ ఆఫీసులోనే దాచిపెట్టారన్నారు జగన్.  చంద్రబాబు అసెంబ్లీలో బెదిరించిన రెండు రోజుల సమయంలోనే నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందారని.. నాన్న మరణంపై అనుమానాలున్నాయన్నారు వైఎస్ జగన్. 


తనపై వైజాగ్ ఎయిన్ పోర్టు లో హత్యాయత్నం  చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటిలోనే జొరబడి దారుణంగా నరికి హతమార్చిన వైనం చంద్రబాబు తెలుగు దేశం ్రభుత్వం హయాంలోనే జరిగిందన్నారు వైఎస్ జగన్. ఏపీ ప్రభుత్వం మీద తమకు నమ్మకం లేదని మూలాలను వెతికి పట్టుకుని దర్యాప్తు జరగాలని కోరారు వైఎస్ జగన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: