వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ రియాక్టయ్యారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? అంత ఘోరంగా చంపుతారా? అంటూ నిప్పులు చెరిగారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వివేకా హత్యపై సీఐడీ, సీబీఐల చేత... అవసరమైతే ఎఫ్బీఐ చేత విచారణ చేయిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 



వైఎస్ వివేకానందరెడ్డి క్రిస్టియన్ అన్న సంగతి తెలిసిందే. అందుకే..  ఒక దైవ బిడ్డను చంపేశారని... అలాంటి వ్యక్తిని చంపేందుకు మీకు చేతులు ఎలా వచ్చాయని కే ఏపాల్ ఆవేశంగా ప్రశ్నించారు. దుర్మార్గులారా, దుష్టులారా మిమ్మల్ని దేవుడు సర్వ నాశనం చేస్తాడంటూ శపించారు. 



వివేకా కుటుంబ సభ్యులపై భగవంతుని కృప ఉండాలంటూ కే ఏ పాల్ ప్రార్థన చేశారు. ఇదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని పాల్ గుర్తు చేసుకున్నారు. పీస్ మిషన్ కు సంబంధించిన సమస్యలపై పోరాడే విషయంలో తనకు వివేకా మద్దతుగా నిలిచారని పాల్ చెప్పారు. 



వివేకానంద రెడ్డి పీస్ మిషన్ విషయంలో అప్పటి విదేశాంగ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీతోనూ పోరాడారని పాల్ గుర్తు చేసుకున్నారు.అలాంటి మంచి మనిషిని హత్య చేయడం దారుణమంటూ సంతాపం ప్రకటించారు. వివేకా హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పాల్ కోరారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: