తెలుగుదేశానికి ఓటేస్తే.. కమ్మ రాజ్యానికి ఓటేసినట్టేనని బల్లగుద్ది చెబుతున్నారు సినీ రచయిత పోసాని కృష్ణ మురళి. ఆయన ఏమంటున్నారంటే.. ఏపీలో కమ్మవాళ్లతో సహా అన్ని కులాల వారికి చెబుతున్నా. చంద్రబాబు ఓ దొంగ, అబద్ధాల మనిషి, అవినీతిపరుడు. ఆయనకు ఓటేయొద్దు.

posani on chandrababu కోసం చిత్ర ఫలితం


చంద్రబాబుకు కనీస విలువలు లేవు. అన్ని కులాల్ని తిట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎవరైనా ఓటేస్తే కమ్మ రాజ్యానికి ఓటేసినట్లే. ఈ సారి పొరపాటున టీడీపీకి ఓటేశారో ఆంధ్రప్రదేశ్‌ కమ్మ సామ్రాజ్యమవుతుంది. రాష్ట్రం నాశనమవుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు పోసాని. 

posani on chandrababu కోసం చిత్ర ఫలితం

ఇంతకూ పోసాని కృష్ణ మురళికి అంత కోపం ఎందుకొచ్చిందంటే.. పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రిగారు.. మీరూ మాటిచ్చారు అంటూ ఒక సినిమాను రూపొందించారు. దాన్ని అడ్డుకోవడాలని టీడీపీ ప్రయత్నిస్తోందట. టీడీపీ ఫిర్యాదు మేరకు  రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి పోసాని కృష్ణ మురళికి ఒక లేఖ వచ్చింది.

posani on chandrababu కోసం చిత్ర ఫలితం

దీనిపై మండిపడిన పోసాని.. ప్రజా జీవితంలో ఉంటే తప్పుడు పనులు చేసినప్పుడు విమర్శించరా? అని నిలదీశారు. తాను తన సినిమాలో చంద్రబాబును విమర్శించలేదు. నాలుగేళ్లు మోదీ కాళ్లు పట్టుకున్నావ్, ఇప్పుడేమో అదే మోదీని తిడుతున్నావ్‌? రాహుల్‌ గాంధీని, సోనియా గాంధీని ఆ వేళ తిట్టావ్‌. ఈ రోజు ఆలింగనం చేసుకుంటున్నావు. నీకు అనుకూలంగా ఉంటే మంచివాళ్లు, లేదంటే చెడ్డవాళ్లా అంటూ చంద్రబాబు వైఖరిని కడిగిపారేశారు పోసాని. 



మరింత సమాచారం తెలుసుకోండి: