ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శించుకుంటున్నారు.  తాజాగా వైసీపీ అధినేత జగన్ ని రావణాసురుడిగా, ఆ పార్టీ నేత రోజాను శూర్పణఖగా అభివర్ణిస్తూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ తరుపున నగరి ఎమ్మెల్యే రోజు ఫైర్ బ్రాండ్ అనేవారు...ఆమెకు ధీటుగా టీడీపీ నుంచి దివ్యవాణిని దించినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యనే టీడీపీలో చేరిన దివ్యవాణి, ఢిల్లీలో చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట దీక్ష వేదికపై పెద్ద కామెడీనే చేశారు. ఆమె ఆవేశంతో ఊగిపోతూ, ప్రధాని నరేంద్రమోడీని విమర్శించేస్తోంటే.. అంతా నవ్వుకున్నారు.   
Related image
ఈ నేపథ్యంలో దివ్యవాణి కొంత కాలంగా షాకింగ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా దివ్యవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..చంద్రబాబు కష్టాన్ని అర్థం చేసుకోలేని వాళ్లు, అభివృద్ధి పథకాలపై బురదజల్లే కార్యక్రమానికి ఓ రావణాసురుడు, శూర్పణఖ పాల్పడుతున్నారంటూ జగన్, రోజాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. 
Image result for mla roja
వైఎస్సార్సీపీ ముఖ్యనేతల్లో ఒకరైన వైఎస్‌ వివేకా మరణం వెనుక టీడీపీ కుట్ర వుందనీ, హత్యా రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబే.. తెరవెనుక కథ నడిపించారనీ వైసీపీ ఎమ్మెల్యే రోజా సైతం ఆరోపించారు. తాజాగా దీనిపై స్పందించిన దివ్యవాణి తన నోటికి పని చెప్పింది. తమ కుటుంబంలోని సొంత బాబాయ్ ప్రాణాలనే కాపాడుకోలేని వ్యక్తి, ఐదు కోట్ల ప్రజలను ఆయన కాపాడతాడనేది నమ్మశక్యంగా లేదని జగన్ పై విమర్శలు చేశారు.

ఇదిలా ఉంటే..సినీ గ్లామర్‌ని వాడుకుని వదిలేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ఒకప్పుడు జయప్రద, రోజా, జయసుధ తదితరుల గ్లామర్‌ని అవసరానికి తగ్గట్టుగా వాడుకుని రాజకీయాలు చేసిన చంద్రబాబు సంగతి తెలియనిదెవరికి..?ఇప్పుడు దివ్యవాణి..ఆమె మాట్లాడే మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఏపి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: