కత్తి మహేశ్ మరోసారి తెరపైకి వచ్చారు. పవన్ కల్యాణ్ ను విమర్శించడం ద్వారా.. ఆయన ఫ్యాన్స్ తో గొడవపడటం ద్వారా కత్తి మహేశ్ బాగానే ఫేమస్ అయ్యారు. ఇటీవల ఆయన చాలా సైలంట్ గా ఉన్నారు. ఆ మధ్య ఆయన్ను తెలంగాణ సర్కారు నగర బహిష్కరణ కూడా విధించింది. 

హైదరాబాద్‌ లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారని ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేశ్ స్పందించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని తెలియ జేస్తున్నాయన్నారు. ఆయన త్వరగా మంచి సైక్రియాటిస్టుకు చూపించుకోవాలని.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కత్తి మహేశ్ వ్యంగ్యంగా అన్నారు. 

తనను తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ విధించినా.. తెలంగాణ ప్రజలు మాత్రం ఏనాడూ పల్లెత్తు మాట అనలేదని కత్తి మహేశ్ గుర్తు చేశారు. రాజకీయం కోసం ప్రజల మనసుల్లో విద్వేషం నింపొద్దని హితవు పలికారు.  ఇదే సమయంలో ఆయన పవన్‌కు పరిటాల రవి గుండుకొట్టించారన్న వదంతిని ప్రస్తావించారు. 

ఇటీవల పవన్ ప్రతి సభలోనూ రాయలసీమ గూండాలు అంటూ మాట్లాడటంపై కత్తి మహేశ్ అభ్యంతరం తెలిపారు. త్రివిక్రమ్ చెప్పిన కథలు వినిచెడిపోద్దని రాయలసీమ వాసులు చాలా ప్రశాంత చిత్తం కలగిన వారని కత్తి మహేశ్ అన్నారు. అంతే కాదు.. నీకు ఎవరో గుండుకొట్టించినంత మాత్రాన రాయలసీమ వాసులందరినీ రౌడీలు అంటారా అని ప్రశ్నించారు. తానూ రాయలసీమ బిడ్డనే అని కత్తి మహేశ్ గుర్తు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: