వై.ఎస్.జగన్.. ఇప్పుడు ఏపీలో మారుమోగుతున్న పేరు.. కాబోయే సీఎంగా ఆయన్ను చాలామంది అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితి ఆయనకు గతంలో ఎన్నడూలేనంత అనుకూలంగా ఉందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 


జగన్‌ కూడా ఏపీకి ముఖ్యమంత్రి కావడంపై గతంలో చాలాసార్లు స్పందించారు. ముఖ్యమంత్రి కావడం అనేది జగన్‌కు చిరకాల వాంఛ. అంతే కాదు.. తన తండ్రి తరహాలో ముఖ్యమంత్రిగా మంచిపేరు తెచ్చుకోవాలన్నది ఆయన డ్రీమ్.. అంతేనా రాష్ట్రానికి ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే.. కనీసం 30 ఏళ్లు పాలించాలన్నది ఆయన కోరిక.

ప్రతి ఇంటిలోనూ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పక్కన తన ఫోటో కూడా ఉండాలని చెబుతారాయన. అయితే తండ్రి రాజశేఖర్ రెడ్డిలా జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అరవింద్ అఘోరా అనే బాబా చెబుతున్నారు. అంతే కాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్‌కూడా హఠాన్మరణం చెందవచ్చని జోస్యం చెబుతున్నారు.    

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్‌ కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే హత్యకు గురికాబడ వచ్చని ఆ అఘోరా బాబా ఊహిస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో ఆందోళనకు దారి తీస్తున్నాయి. అఘోరా బాబాలకు చాలా శక్తియుక్తులుంటాయని నమ్ముతారు. మరి అరవింద్ అఘోరా చెబుతున్నది ఎంత వరకూ వాస్తవమో కాలమే చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: