ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో పత్రిక యజమాని రాధాకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన బృందం తర్వాతే ఎవరైనా.. అంటోంది ఓ ప్రముఖ దిన పత్రిక. ఈ విషయంలో వాళ్లకు పోటీగా భవిష్యత్తులో కూడా ఎవరూ రారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారట. రాధాకృష్ణ పత్రిక రాతలన్నీ ఆకాశరామన్న ఉత్తరంలా ఉంటాయని ఆ పత్రిక ఆరోపిస్తోంది.
చంద్రబాబు, ఆయన బినామీలపై ఎన్ని అవినీతి మరకలు ఉన్నా వాళ్లందరూ రాధాకృష్ణకు నీతిమంతులుగానే కనిపిస్తారట. వాళ్లు ప్రజాధనాన్ని దోచుకున్నా, పన్నులు ఎగ్గొట్టినా వాటి గురించి ఒక్క వార్త కూడా ఆయన టీవీలో రావడం, పత్రికలో ప్రచురితమైన సందర్భాలు ఉండవని సదరు పత్రిక చెబుతోంది.
చట్ట ప్రకారం రాజ్యాంగ సంస్థలు దోపిడీదారులపై దాడులు చేస్తే.. అది రాజకీయ కక్ష్య సాధింపు చర్యలని.. చంద్రబాబు ధర్నాలు, నిరసనలకు దిగుతాడట. చంద్రబాబు చేసే తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలు, అసత్య ప్రచారాలను రాధాకృష్ణ తన చెత్తపలుకులో వివరంగా రాసి చంద్రబాబుపై సానుభూతి కలిగేలా ప్రజలను మభ్యపెడతాడట..ఇలా ఓ ప్లాన్ ప్రకారం ఈ ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారట.
అంతే కాదు.. బాబు అండ్కో తమ తప్పులను ఎలా సమర్థించుకుంటారో సమగ్రంగా తెలిసేలా ఓ వీడియో కూడా రూపొందించింది ఆ పత్రిక. మరి ఈ వివరాలూ పూర్తిగా తెలియాలంటే ఆ వీడియో చూసి తీరాల్సిందే. ఒక పత్రిక లొసుగులు మరో పత్రిక బయటపెట్టడం బాగానే ఉంది. ఇలాగైనా మీడియా కుట్రలు వెలుగు చూస్తాయి కదా.