ఏపీ సీఎం చంద్రబాబుపై సినీ నటుడు మోహన్ బాబు మరోసారి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నిన్న మొన్నటి వరకూ సినీనటుడిగా తిట్టిన మోహన్ బాబు.. ఇప్పుడు వైసీపీలో చేరాక ఇంకాస్త జోరు పెంచేశారు. ఎంతసేపూ జగన్‌ను దొంగటావ్.. అసలు నువ్వెవరంటూ నిలదీశారు. 


ఎంతసేపూ వైయస్‌ జగన్‌పై నిందలు వేస్తావు తప్ప..నీ పక్కనున్న దొంగలు గురించి మాట్లాడవే.. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఇంకా విచారణకు రాకుండా ఎందుకు అడ్డుకున్నావు. అన్ని కేసుల్లోనూ ఎందుకు స్టేలు తెచ్చుకున్నావు. నీవు దొంగవి కాదా అంటూ మోహన్ బాబు మండిపడ్డారు. 

ఓటుకు నోటు కేసులో  చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారన్నారు మోహన్ బాబు. .బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఒక నటుడుగా, నిర్మాతగా లంచం అనే పదానికి అర్థం తెలియని, నిద్రహారాలు మాని కష్టపడి రోడ్లపై తిరిగి తెలుగువాడి పౌరుషం నిరూపించిన మహానటుడు ఎన్టీఆర్‌ది తెలుగుదేశం పార్టీ అని మోహన్ బాబు అన్నారు. అక్రమంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు లాక్కున్నారని తెలిపారు. 

చంద్రబాబు..ఎన్టీఆర్‌ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌ వద్ద తాకట్టు పెట్టారన్నారు. హరికృష్ణకు చంద్రబాబు ఏం చేశారో ఇప్పటికైనా చెప్పాలన్నారు. మోదీ ఆంధ్రాకు వస్తే బేడీలు వేస్తానన్న చంద్రబాబు..ఎందుకు జతకట్టారని ప్రశ్నించారు. వైశ్రాయ్‌ హోటల్‌ వద్ద ఎన్టీఆర్‌ మీద చెప్పులు వేయించడం నాకు
తెలుసునన్నారు. పసుపు–కుంకుమ డబు ప్రజలదేనని.మీ డబ్బే మీకు ఇస్తున్నారన్నారు. 

ప్రజల శ్రేయస్సు కోసమే వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్టీఆర్‌కు విరోధి అయిన కాంగ్రెస్‌తో చంద్రబాబు జత కట్టారన్నారు. చంద్రబాబుది కుటుంబపాలన అని అన్నారు. చంద్రబాబు పునాది కాంగ్రెస్‌ అని అన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక,మట్టి అన్ని దోచుకున్నారన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: