వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలవనుందా.. చంద్రబాబు గద్దె దిగడం ఖాయమేనా.. ఈసారి వైసీపీ అధికార పీఠం అందుకుంటుందా.. ఇప్పుడు ఇవే ఇంట్రస్టింగ్ టాపిక్స్. ఐతే.. ఓ ఛానల్ చెబుతున్న పరిశీలన ప్రకారం చంద్రబాబు కొంప ముంచుతున్న అంశాలు కొన్న ఉన్నాయి. 


అవేంటో పరిశీలిద్దాం.. వాటిలో మొదటిది మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి. పదేళ్ల తర్వాత అధికారానకి రావడంతో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో బీభత్సమైన అవినీతికి పాల్పడ్డారట. ఇక రెండో అంశం.. జన్మభూమి కమిటీల మితిమీరిన జోక్యమంట. 

మరో కీలక అంశం పార్టీలో చంద్రబాబుది ఒంటరి పోరాటం కావడం.. పార్టీలో కేవలం ఆయన ఒక్కడే అన్నీ అయి నడిపించడం కూడా ఓ పెద్ద మైనస్ పాయింట్ అయ్యింది. ఇది చంద్రబాబు చేతులారా చేసుకున్నదే అని చెప్పొచ్చు. 

అలాగే ... ప్రత్యేక హోదా విషయంలో పదే పదే పిల్లిమొగ్గులు వేయడం చంద్రబాబు కొంప ముంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో అమరావతి అంశం కూడా మైనస్ పాయింట్ కానుంది. సింగపూర్, మలేషియా అంటూ గ్రాఫిక్స్ తో  అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు.. చివరకు ఏవో నాలుగు బిల్డింగులు కట్టి ఊరుకోవడం కూడా పెద్ద మైనస్ కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: