అఘోరాలు అంటే శివ భక్తులు.. శ్మశానాల్లోనే నివశిస్తారు.. కపాలాల్లో భోజనం చేస్తారు. పచ్చి మాంసం తింటారు.. ఇలాంటి వాదనలు చాలా వినిపిస్తాయి. మరి అలాంటి అఘోరాలు రాజకీయాలు కూడా ఆలోచిస్తారుట. తమ శక్తులతో భవిష్యత్ కూడా చెబుతారట.


అలాంటి అఘోరా బాబా ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆయన జగన్ సీఎం అవుతారని.. సీఎంగా పదవిలో ఉండగానే తండ్రి రాజశేఖర్ రెడ్డిలా మరణిస్తారని ఈ అవరింద్ అఘోరా బాబా చెప్పడం సంచలనం సృష్టించింది. 

ఇదే విషయాన్ని అరవింద్‌ అఘోరా పదే పదే చెబుతున్నారు. జగనే సీఎం అని కుండ బద్దలు చెప్పి మరీ చెబుతున్నారు. తమ శక్తితో భవిష్యత్‌ ను దర్శించగలమని చెబుతున్న ఆయన జగనే సీఎం అవుతారని వంద రూపాయల బాండ్ పేపర్ పై సంతకం పెట్టి మరీ చెప్పారు.

ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఈ విషయాన్ని మీరు బాండ్ పేపర్ పై రాసి ఇవ్వగలరా అని అడిగారు. అందుకు అఘోరా బాబా ఏమాత్రం తడుముకోకుండా బాండ్ పేపర్ పై సంతకం పెట్టి మరీ చెప్పారు. నా మాటపై నాకు నమ్మకముంది.. జగనే కాబోయే సీఎం అని తేల్చి చెప్పేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: