వై.ఎస్. షర్మిల.. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా క్రేజ్ ఉన్న నాయకురాలు. అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకునేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాయకురాలు. తండ్రి వైఎస్సార్‌ లాగానే ధృఢ చిత్తం, ధైర్యం ఈమెలో కనిపిస్తున్నాయి. 


తాజాగా ఆమె వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల తీరుపై సెటైర్లు పేలుస్తూ జోరుగా దూసుకెళ్తున్నారు. జగన్ సభల తరహాలోనే షర్మిల సభలకు కూడా జనం బాగా వస్తున్నారు. 

ప్రచారంలో దూసుకెళ్తున్న షర్మిల.. అచ్చం తండ్రిని గుర్తు చేస్తున్నారు. తండ్రి తరహాలోనే ప్రచారం సాగిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరపిస్తున్నారు. ప్రచారం ముగించిన తర్వాత వైఎస్సార్.. అందరికీ అభివాదం చేసేవారు. నమస్తే బాబూ.. నమస్తే పాపా.. నమస్తే.. చెల్లెమ్మా..

నమస్తే  అన్నయ్యా.. నమస్తే తమ్ముడూ..అంటూ అందరికీ ప్రేమగా వీడ్కోలు చెప్పేవారు.
ఇప్పుడు షర్మిల కూడా అదే తరహాలో అందరినీ పలకరిస్తున్నారు. ఉంటానన్నా.. ఉంటా తమ్ముడూ.. నమస్తే అమ్మా.. నమస్తే చెల్లీ.. నమస్తే అంటూ అభివాదం చేస్తూ తండ్రిని గుర్తు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: