జగన్ అధికారంలోకి వస్తే అంతా అరాచకమే.. పులివెందుల రౌడీలు రాష్ట్రమంతటా రెచ్చిపోతారు.. ఇదీ చంద్రబాబు తరచూ చెప్పే డైలాగ్.. సేమ్ టు సేమ్ ఫాలో అవుతున్న పవన్ కల్యాణ్‌ కూడా ఈ మధ్య ఇదే డైలాగ్ చెబుతున్నాడు.


ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇప్పుడు పులివెందుల రౌడీలు తిరుగుతున్నారని పవన్ ఆమధ్య కామెంట్ చేశాడు. అంతే కాదు.. అలాంటి వారిని తానే రంగంలోకి దిగి పైటింగ్ కూడా చేస్తానంటూ రెచ్చిపోయాడు. మరి ఇంతకూ పులివెందుల రౌడీలు ఎవరిని ఏమి చేశారో ఒక్కరూ చెప్పలేదు. 

ఇప్పుడు తెరపైకి భీమవరం రౌడీలు వచ్చారు.. ఈ డైలాగ్ కూడా టీడీపీ నుంచే వచ్చింది. మంత్రి కాలువ శ్రీనివాసులు ఏకంగా భీమవరం రౌడీలు వచ్చారంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. తాను పోటీ చేస్తున్న రాయదుర్గం నియోజవర్గంలో అల్లర్లు సృష్టించేందుకు భీమవరం రౌడీల బ్యాచ్‌ వచ్చిందంటున్నారాయన. 

వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తరపున భీమవరం రౌడీలు వచ్చారని ఫిర్యాదు చేశారు మంత్రి కాలువ శ్రీనివాసులు. తన ప్రతి కదలికను భీమవరం రౌడీల బ్యాచ్ గమనిస్తోందంటున్నారాయన. పులివెందుల రౌడీలు అంటే జగన్‌ బ్యాచ్ కావచ్చని అనుకోవచ్చు. మరి భీమవరం రౌడీలు అంటే పవన్ బ్యాచా.. పవన్ బ్యాచ్ వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు.. ఏమో అంతా టీడీపీ నేతలకే తెలియాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: