ఏపీలో చంద్రబాబు ఓడిపోబోతున్నారు.. ఈమాట ఇప్పటికే చాలా సర్వేలు చెప్పాయి. ఇందులో పెద్ద విశేషం లేదు. కానీ ఇందులో అన్ని రకాల సర్వేలు ఉన్నాయి. కొన్ని పత్రికలు చేశాయి. మరికొన్ని పార్టీల వారు చేశారు. మరి కొన్ని సంస్థలు చేశాయి. 


చాలా వరకూ ఫలితం మాత్రం చంద్రబాబు ఓడిపోతాడనే వచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరో సర్వే కూడా బయటకు వచ్చిందట. అదే బీజేపీ సర్వే.. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత, మంత్రి పీయూష్ గోయల్ బయట పెట్టారు. 

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలలో ఆదరణ లేదని తమ సర్వేలో తేలిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో కామెంట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారం లేకపోతే 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు గెలిచేవారు కాదని ఆయన అన్నారు. 

కేంద్రం అడిగినదానికంటే ఎక్కువ సహకారం అందిస్తుందని మొదట్లో చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత  మాట మార్చారని పీయూష్ గోయల్ గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు గురించి లెక్కడిగితే.. చంద్రబాబు నుంచి నేటీకి సమాధానం లేదన్నారు. మరి బీజేపీ సర్వే ఎంతవరకూ నిజమవుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: