టీడీపీ ఓటమి ఖాయమైందా.. అవునంటోంది విజయవాడ బెట్టింగ్ డైరీ.. అదేంటి బెట్టింగ్ డైరీ టీడీపీ ఓటమి గురించి చెప్పడమేంటి.. అసలు ఈ బెట్టింగ్ డైరీ ఏంటనుకుంటున్నారా.. ఇప్పుడు విజయవాడలో కలకలం సృష్టిస్తున్న కథనం ఇది.


విజయవాడలో ఓ బెట్టింగ్ ముఠా సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారట. ఆ దాడిలో ఓ డైరీ దొరికిందట. ఆ డైరీ చూసిన పోలీసులకు మతిపోయిందట. విషయం ఏంటంటే.. ఈ డైరీలో కోట్ల రూపాయల్లో పందాలు కాసుకున్న వివరాలన్నీ రాసి ఉన్నాయట. 

విశేషం ఏంటంటే.. ఈ బెట్టింగ్ డైరీలో చాలావరకూ వైసీపీ గెలుస్తుందని కోట్ల రూపాయల్లో పందేలు కాసి ఉన్నారట. టీడీపీ గెలుస్తుందని కాసిన వాళ్లు చాలా తక్కువట. కోట్ల రూపాయల్లో పందేలు కానుకునే వారు గ్రౌండ్ రిపోర్ట్ ను అంచనా వేసుకున్నాకే ఆ స్థాయిలో పందేలు కాస్తారు. 

అంటే బెట్టింగ్ మాఫియా అంచనాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయం అన్నమాట. అందుకే కోట్లకు కోట్లు వైసీపీ తరపున పందేలు కాశారు. సో.. వచ్చే ఎన్నికల ఫలితాలను ఈ బెట్టింగ్ మాఫియా ముందే ఊహించిందన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: