తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుడుగా ఉన్నారన్న అబియోగాల అనంతరం రాష్ట్ర డిజిపికి ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చిందని వార్తవచ్చింది. ఆయనపై వచ్చిన అబియోగాలు చూపి వివరణ కోరతారా? లేక మందలించి పంపుతారా? ఇంకేమైనా ఆదేశాలు ఇస్తారా? అన్నది ఇంకా తెలియదు. కాని డిజపి ఆర్.పి ఠాకూర్ ఎన్నికల కమిషనర్లను కలవడానికి డిల్లీ వెళ్ళిన మద్యాహ్నం డిల్లీలో వారితో బేటీ అవుతారనే సమాచారం. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీకి ఈసీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత ఏర్పడింది.
ఏపీ అధికార పక్షానికి అనుకూలంగా కొందరు కీలక ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ శాఖకు చెందిన వారు డిజిపితో సహా కొందరు సహకరిస్తున్నారన్న ఆరోపణలు భారీగా వెల్లువెత్తు తున్నాయి. దీనిపై ఇప్పటికే ఏపీ విపక్షం వైసిపికి చెందిన నేతలనేకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇందులో భాగంగా ఇటీవల ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుతో కలిపి ముగ్గురు పోలీస్ సీనియర్ అధికారులపై ఈసీ వేటువేయటం పెనుదుమరానికి కారణమైంది. ఈసీ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయగా, తాము చేసిన ఫిర్యాదుల్లో కొన్నింటిపైనే చర్యలు తీసుకోవటం ఏమిటంటూ, విపక్షనేతలు ఈసీని ప్రశ్నించారు.
ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తీరు బాగోలేదని, ఆయన ఏపీ అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై వైసిపి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, ఏపీ డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఈ మధ్యాహ్నం ఈసీని కలువనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల అమలును ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీని ఈసీ వివరణ కోరిన సంగతి తెలిసిందే.
తాజా భేటీలో, ఇటీవల తాము జారీచేసిన ఉత్తర్వుల అమలు విషయంలో డీజీపీని వివరణ కోరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీపై ఈసీ నిర్ణయం తీసుకున్నా తర్వాత, అదిప్పటివరకూ అమలు కానివైనంపై వివరణ కోరనున్నట్లుగా చెబుతున్నారు. ఈసీ నుంచి ఏపీ డీజీపీకి పిలుపు రావటంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. మరి, ఏపీ డీజీపీ విషయంలో ఈసీ ఏ రీతిలో రియాక్ట్ కానుంది? దానికి ఏపీ డీజీపీ ఎలా రియాక్ట్ కానున్నారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న చంద్రబాబుకు, ఈసీ నిర్ణయం మరో షాకింగ్ గా మారుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.