లక్ష్మీపార్వతి.. నందమూరి తారక రామారావు రెండో భార్యగా ప్రపంచానికి సుపరిచితం.. ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలైన నేపథ్యంలో ఆమె మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఏపీలో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడటం కూడా వివాదాస్పదమైంది. 


ఇలాంటి సమయంలో టీవీ 5 ఛానల్‌ లక్ష్మీపార్వతిపై సంచలన కథనం ప్రసారం చేసింది. లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ కోటి అనే వ్యక్తి వినుకొండలో పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్టు కథనం ప్రసారం చేస్తోంది. ఈ కోటి అనే వ్యక్తి దాదాపు నాలుగేళ్లుగా లక్ష్మీపార్వతి వద్ద అసిస్టెంట్‌గా పని చేశాడు. 

ఐతే.. ఎన్టీఆర్ పై అభిమానంతో తాను ఆమె దగ్గర అసిస్టెంట్‌గా పని చేశానని..  కానీ ఏడాది కాలంగా ఆమె తనను లైంగికంగా వేధిస్తోందంటూ కోటి కొన్ని ఆధారాలు బయటపెట్టినట్టు టీవీ5 లైవ్‌ షోలో తెలిపాడు. ఐతే.. ఈ కోటి అనే వ్యక్తి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాడన్నది అర్థం కాని విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: