నందమూరి తారక రామారావు రెండో భార్య.. వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతిపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. తన కోరిక తీర్చమని లక్ష్మీపార్వతి లైంగికంగా తనను వేధిస్తోందని..  ఆమె అనుచరుడు కోటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


తనకు ఆసక్తి లేదని చెప్పినా... తన కోరిక తీర్చాలని.. ఎంజాయ్ చేద్దామని..  ఆమె తనను లైంగికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. 

ఇందుకు సంబంధించి లక్ష్మీపార్వతి తనకు పంపిన వాట్సాప్ సందేశాలను, ఇతర సాక్ష్యాలను పోలీసులకు కోటి అందజేశాడు. చిన్న వయస్సులోనే జీవితంలో అన్నీ కోల్పోయాను.. ఎన్టీఆర్ నాకు ద్రోహం చేశారు అంటూ లక్ష్మీపార్వతి తనకు మెస్సేజ్‌లు పెట్టేదని కోటి అంటున్నాడు. 

ఐ లవ్‌ యూ కోటి.. నన్ను అర్థం చేసుకో... మీ ఫ్యామిలీపై చూపించే ప్రేమలో నాలుగో వంతు ప్రేమయినా నాకు పంచవచ్చు కదా.. అంటూ సందేశాలు పంపిందని కోటి ఆరోపించాడు. తనకు ఆసక్తి లేదని.. ఎంత చెప్పినా వినకుండా వేధించడం వల్లే కేసు పెట్టానని కోటి చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను టీవీ5 ప్రసారం చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: