భారతీయ జనతా పార్టీ..జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ఒకే ఒక ప్రత్యామ్నాయంగా ఉన్న ఈ పార్టీ ఆంధప్రప్రదేశ్ లో ముఖ్య నాయకుడు సోము వీర్రాజు. ఎటువంటి అభిప్రాయమైనా..కుండ బద్దలు కొట్టినట్లు  ముక్కు సూటిగా చెప్పడమే ఆయన అలవాటంటారు వీర్రాజు గురించి తెలిసిన వాళ్ళు.


సోము వీర్రాజు ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  పవన్ కళ్యాన్ ఎప్పటికయినా తెదేపా కొమ్ముకాసే వ్యక్తిగా మిగిలిపోతారని..పవన్ పథకం ప్రకారమే తెదేపాని విమర్శించి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి  ప్రయత్నించారని, పవన్ ను సదుద్దేశంతోనే బీజేపీలో జాయినవమని అడిగామని అయితే పవన్ చేస్తున్న విధానంతో చరిత్రలో కొమ్ముకాసే వ్యక్తిగానే పవన్ మిగిలిపోతారన్నారు సోము వీర్రాజు.


మరి ఈ మాటల్లో నిజమెంత? ఆంధ్రప్రజలు ఏమనుకుంటున్నారన్నది ఇంకో వారం రోజుల్లో ఈవీఎం లలో..మే 23 తారీఖున ఫలితాల్లో తెలుసుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: