వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ప్రజలు మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, వైఎస్‌ జగన్‌ మీద ఉన్న కేసులు ఎలా పెట్టారో? ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. అక్రమ కేసులను వైఎస్‌ జగన్‌ ధైర్యంగా ఎదుర్కొంటుంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం తనపై ఉన్న ప్రతిఒక్క కేసు విచారణలు నిలుపుదల తెచ్చుకుని బతుకుతున్నారని మండిపడ్డారు.

21 corrupt leaders in TDP కోసం చిత్ర ఫలితం

"ఓటుకు నోటు కేసు"లో నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికారు. స్టీఫెన్‌సన్‌ తో ఫోన్‌లో మాట్లాడింది తానుకాదని ఒక్కసారైనా బయటికి వచ్చిచెప్పారా! కేసు అనగానే స్టే తెచ్చుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయనను స్టేల బాబు అని పిలిస్తేనే బాగుంటుంది" అని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో చంద్రబాబు టెలికాన్ఫరెన్సులు పెట్టి మరీ టీడీపీ నేతలకు వైఎస్‌ జగన్‌ను తిట్టాలి అని చెబుతున్నారే తప్ప, తానేం అభివృద్ధి చేశారో ప్రజలకు మాత్రం చెప్పట్లేదని విమర్శించారు.


చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ₹ 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. "కేసుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఆయన దొంగలకే పెద్ద దొంగ. ఇక టీడీపీ అభ్యర్థులు 21మందిపై కేసులు ఉన్నాయి.

TDP Leaders with Crime record కోసం చిత్ర ఫలితం 

*మీ బినామీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఎలా సంపాదించారో?

*ఎన్ని కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారో చంద్రబాబు కు తెలియదా?

*రాయపాటి, గంటా అక్రమంగా ఎంత సంపాదించారు? ఎన్ని భూములు కబ్జా చేశారు?

*బోండా ఉమా ఒక ఐపీఎస్ అధికారి చొక్కా పట్టుకోలేదా?

*బడేటి బుజ్జి ఎన్ని భూములను తిన్నారు?

*యరపతినేని మైనింగ్ మాఫియాను ఎలా ప్రోత్సహిస్తున్నారు?

*చింతమనేని అరాచకాల సంఖ్య ఎంత? 

 TDP Leaders with Crime record కోసం చిత్ర ఫలితం

 అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఇలా వందల మంది దొంగలకు నాయకుడు చంద్రబాబు, ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ ను ఎదుర్కోలేక ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తు బ్రతికేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు కేసులు ఎదుర్కొంటున్న 21మంది టీడీపీ అభ్యర్థుల పేర్లు ఆమె వెల్లడించారు.

సంబంధిత చిత్రం

చింతమనేని ప్రభాకర్‌ , గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కోడెల శివప్రసాదరావు, కాలువ శ్రీనివాసులు, బోండా ఉమా, పల్లె రఘునాథరెడ్డి, అచ్చెం నాయుడు, కోన రవికుమార్‌, సబ్బం హరి, నక్కా ఆనందబాబు, కరణం బలరాం, సతీశ్‌ కుమారరెడ్డి, రామసుబ్బారెడ్డి, జితేందర్‌ గౌడ్‌, నందమూరి బాలకృష్ణ, బీకే పార్థ సారథి,వెంకట శివకుమార రాజు, మాగంటి వెంకటేశ్వరరావు, నిమ్మల కిష్టప్ప, యరపతినేని శ్రీనివసరావు తదితరులపై కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

vasireddy padma కోసం చిత్ర ఫలితం

"ఎన్నికల ముందు పసుపు కుంకుమ‌ పేరుతో తాయిలాలు ఇస్తున్నారు. పసుపు కుంకుమ ఇచ్చి మహిళల మంగళ సూత్రం మీద ఓటు వేయాలని ఒట్టు వేయించుకుంటు న్నారు. అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఏదీ ఇవ్వకుండా మోసం చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకు ఇలా నేఱ మనస్తత్వం ఉండటం రాష్ట్రానికి తీరని తీవ్ర నష్టం అని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

sujana chaudhary - cm ramesh - bida mastan rao కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: