కుప్పం చంద్రబాబు కంచుకోట. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందించిన నియోజకవర్గం ఇది. ఇక్కడ చంద్రబాబు గెలుపు ఓ లాంఛనమే. చంద్రబాబు నియోజకవర్గానికి నామినేషన్ వేయడానికి గానీ, ప్రచారం చేసేందుకు కానీ వెళ్లకపోవడం మరో విశేషం.
అలాంటి కుప్పంలో నిర్వహించిన రోడ్షోలో వైఎస్ జగన్.. చంద్రబాబు పరువు తీసేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన కొన్ని రహస్యాలను జగన్ బయటపెట్టారు. చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ పేరిట కొన్ని ఆస్తులు ఉండేవట. సాధారణంగా తల్లిదండ్రుల వారసత్వ ఆస్తులను పిల్లలు సమంగా పంచుకుంటారు.
చంద్రబాబు ఇంటికి పెద్దగా కొడుకు ఉన్నారు. ఆయనకు ముగ్గురుతోబుట్టువుట. అయితే తల్లిపేరిట ఉన్న ఆస్తులు మాత్రం చంద్రబాబు తోబుట్టువులకు ఏమాత్రం పంచలేదట. ఆ ఆస్తులను లోకేశ్ కు బహుమతి కింద రాయించుకున్నారట. ఎన్టీఆర్ ఆడపిల్లలకు ఆస్తి హక్కులో వాటా
ఇస్తే.. దాన్ని అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అన్నారు.
అంతే కాదు.. ఆయన తన సోదరుడు రామ్మూర్తి నాయుడిని కూడా దారుణంగా మోసం చేశారట. ఆయన చంద్రబాబు మోసాల కారణంగా మతిస్థిమితం కోల్పోయారట. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చంద్రబాబు చెప్పగలరా అంటూ జగన్ అడిగారు. అంతే కాదు.. సొంత బావమరిది హరికృష్ణ శవాన్నిపక్కన పెట్టుకుని కూడా టీఆర్ఎస్తో పొత్తుకు రాజకీయం చేశారు చంద్రబాబు అంటూ జగన్ జోరుగా విమర్శలు చేశారు.