ఏపీ సీఎం చంద్రబాబు గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు కు నోట్లు ఆఫర్ చేస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడిన ఆడియో అప్పట్లో సంచలనంగా మారింది. బాబు బ్రీఫ్డ్ మీ అన్న డైలాగ్ పాపులర్ అయ్యింది.
ఇప్పుడు అలాంటి మరో ఉదంతం వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా కుప్పం నాయకులతో చంద్రబాబు మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో వెలుగు చూసింది. కుప్పంలో వైఎస్ జగన్ ఎన్నికల సభ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ మాటలు మాట్లాడారు..
జాగ్రత్తగా గమనించండి.. జగన్ సభకు ఒక్కరూ వెళ్లకూడదు.. వెళ్లిన వారిని గుర్తించండి..ఎవరైనా వెళ్లినా మనం నోట్ చేసుకుంటే భవిష్యత్లో మనకో ఐడియా ఉంటుంది. వాళ్లను ఏం చేయాలో ఇప్పుడు మనం మాట్లాడనక్కర్లేదు. మనం మళ్లీ చుసుకుంటాం. వాళ్లకు వచ్చే బెనిఫిట్ రానివ్వకుండా చేస్తే సరిపోతుంది.
ఇలా సాగింది ఆ వీడియోలో ప్రసంగం.. ఇదే నిజమైతే చంద్రబాబు అధికారం అడ్డుపెట్టుకుని బెదిరించడమే అవుతుంది. మరి ఈ ఆడియోపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.