వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి దమ్మున్న మగాడని.. ఆయన తనను తాను నిరూపించుకునేందుకు ఏపీ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని బీసీ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్య ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్‌కు మద్దతుగా ఆయన ఏపీలో ప్రచారం కూడా చేస్తున్నాడు. ఆర్‌ కృష్ణయ్యకు  బీసీ కులాల ఉద్యమ కారుడిగా మంచి పేరుంది.


జగన్ ప్రవేశపెడుతున్న నవరత్నాల పథకాలపై బీసీ కృష్ణయ్య ప్రశంసల వర్షం కురిపించారు. పేదలకు ఈ వరాలు ఆశాకిరణాల్లాంటివన్న కృష్ణయ్య.. ప్రత్యేకించి బీసీ కులాల అభ్యున్నతికి ఈ నవరత్నాలు చాలా ఉపయోగపడతాయన్నారు. నవరత్నాలతో బడుగు జీవితాలు మారిపోతాయని ఆశాభావం వక్తం చేశారు.

చంద్రబాబు పచ్చి మోసగాడని.. జగన్ నవరత్నాలను కాపీ కొట్టి చివరి నిమిషంలో మేనిఫెస్టోలో చేర్చుకున్నాడని కృష్ణయ్య మండిపడ్డారు. చంద్రబాబుకు బీసీలు ఎదగడం ఇష్టం లేదన్న కృష్ణయ్య.. అందుకే బీసీలకు కులాల వారీగా తాయిలాలు ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు దృష్టిలో బీసీలు ఇంకా గొర్రెలు కాసేవారిగానో.. పందులు కాసే వారిగానో మిగిలిపోవాలని అనుకుంటున్నారని ఆర్ కృష్ణయ్య అన్నారు. కానీ జగన్ ప్రవేశపెడుతున్న నవరత్నాలతో బీసీలు అందరూ ఉన్నత విద్యావంతులై చక్కటి భవిష్యత్ అందుకుంటారన్నారు. చంద్రబాబును అక్షరాశ్యులే కాదు.. నిరక్ష్యరాశులు కూడా నమ్మడం లేదన్నారు బీసీ కృష్ణయ్య. 



మరింత సమాచారం తెలుసుకోండి: