జగన్ వస్తే.. రౌడీ రాజ్యం వస్తుంది.. శాంతి భద్రతలు ఉండవు... ఇదీ తరచూ చంద్రబాబు చెబుతున్న మాట. కానీ ఆయన మంత్రివర్గంలో మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్న సంగతి జనంలో చర్చనీయాంశమవుతోంది. 


తాజాగా పోస్టల్ బ్యాలెట్‌ పోలింగ్ వేళ అనంతపురంలో మంత్రి కాల్వ శ్రీనివాసుల దౌర్జన్యం చూసిన వారికి ఇదేమి రౌడీ రాజ్యం అనిపించకమానదు.. పోస్టల్ బ్యాలెట్ కేంద్రానికి వస్తున్న మంత్రిని ఫోటోలు, వీడియోలు తీయడమే మంత్రి ఆగ్రహం తెప్పించింది. 

నా ఫోటో తీస్తావురా అంటూ మంత్రి కాల్వ  ఓ ఛానల్ రిపోర్టర్ పై రెచ్చిపోయారు. మీదేంటి.. ఎవరిదైనా తీస్తాం.. ఇందులో ఇబ్బంది ఏంటి.. అని రిపోర్టర్ ప్రశ్నించే సరికి మంత్రి కాల్వ ఇంకాస్త రెచ్చిపోయారు.. నన్నే ప్రశ్నిస్తావా అంటూ మీద మీదకు ఉరికారు.

ఆయన సిబ్బంది కాస్త అదుపు చేయబట్టి సరిపోయింది కానీ లేకపోతే సదరు విలేఖరిపై చేయిచేసుకునేంతగా కాల్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెమేరాలు, వీడియో జర్నలిస్టుల ముందు మంత్రి బహిరంగంగా దుర్భాషలాడటం చూసేవారికి విస్తుగొలిపింది. మరి ఇది రౌడీ రాజ్యం కాదా.. అని అనంతపురం జనం ప్రశ్నిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: