ఏపీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ఇంకా కొన్ని గంటలే ప్రచారం మిగిలి ఉంది. ఇప్పటికే చంద్రబాబు అండ్ టీమ్ జోరుగా సభలు నిర్వహిస్తున్నారు. వీటిని ఎల్లో మీడియా నిరంతరం లైవ్ కవరేజ్ ఇస్తూ సాధ్యమైనంత మేర పబ్లిసిటీ ఇస్తున్నారు.
ఇప్పుడు అవి చాలదన్నట్టు.. మరో అస్త్రాన్ని బయటకు తీశారు. అదే శివాజీ అస్త్రం.. ఈ అస్త్రాన్ని ఇప్పటికే చాలాసార్లు ప్రయోగించారు. గతంలో ఆపరేషన్ గరుడ అంటూ హడావిడి చేయించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య మరోసారి టీడీపీ నేతలపై దాడులు అంటూ హడావిడి చేశారు.
ఇప్పుడు సరిగ్గా పోలింగ్కు సరిగ్గా నాలుగు రోజుల ముందు.. శివాజీ మరోసారి తెరపైకి వచ్చాడు. ఈసారి ప్రజెంటేష్ భిన్నంగా ఉంది. మీడియా హౌజుల్లో ఎఫెక్టులతో రెడీ చేయించిన వీడియోను లైవ్లో ప్రజంట్ చేయిస్తున్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలు అంటూ అభివృద్ధి అద్భుతంగా జరిగిందంటూ పచ్చ ప్రచారం సాగిస్తున్నారు.
ఇప్పటికే పలు ప్రెస్ మీట్లలో టీడీపీ నేతలు రోజూ మాట్లాడే విషయాలనే శివాజీ వీడియోల రూపంలో ప్రజంట్ చేశారు. ప్రభుత్వం అందించిన ప్రోగ్రెస్ రిపోర్టులకు వీడియో రూపం ఇచ్చి దాన్నే నిజం విత్ శివాజీ పేరుతో మరోసారి తమ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.