భారత దేశంలో వెయ్యి తూటాల కన్నా..ఒక్క ఓటు బలం ఎంతో అని అంటారు. ఓటు ఒక రాజకీయ నాయకుడి దశ, దిశా నిర్ధేశిస్తుంది. మనం మంచి నాయకుడిని ఎన్నుకుంటే దేశం పల్లె,పట్టణం,రాష్ట్రం,దేశం అభివృద్ది చెందుతుంది. అలాంటి ఓటు ఐదేళ్లకు ఒక్కసారి వస్తుంది..అయితే ఈ మద్య కొన్ని టెక్నాలజీ ఇబ్బందుల వల్ల చాలా మంది ఓట్లు గల్లంతవుతున్నాయి.
వాటిని సరిదిద్దుకోవడానికి కొంత మంది ప్రయత్నిస్తుంటే..కొంత మంది మాత్రం నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. అయితే అన్ని ఫార్మాలిటీస్ సక్రమంగా పూర్తిచేసినా కొందరికి ఓటర్ ఐడీ జారీకాదు. జారీ అయినా కొన్ని చేతికి అందకుండా మిస్సవుతుంటాయి. ఓటర్ ఐడీ లేకపోతే ఓటు వేయలేమేమోనని చాలామంది కంగారుపడుతుంటారు.