ఏప్రిల్ 11 సాయంత్రంతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు దుష్టపరిపాలన ముగిసిందంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి.. ఈ ఎన్నికల్లో జగన్ జయకేతం ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజుల పాటు వైసీపీ శ్రేణులు తన విజయం కోసం కృషి చేశాయంటున్న ఆళ్ల.. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. 


ఇక వచ్చేది రాజన్న రాజ్యమేనని.. జగన్ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని తలపించేలా పాలన సాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. తనను ఓడించేందుకు తెలుగుదేశం ఎన్ని కుయుక్తులు పన్నినా అధి సాధ్యం కాలేదని ఆళ్ల ధీమాగా అంటున్నారు. 

మంగళగిరిలో లోకేశ్ ఓటమి ఖాయమైందని.. రాజశేఖర్ రెడ్డి స్పూర్తితో పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల కోసం నిరంతం శ్రమిస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. తనకు తెలిసిన వారు.. తెలియని వారూ అంతా తన విజయం కోసం ప్రయత్నించారని.. అందరికీ జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానన్నారు ఆళ్ల. 

జగనన్నసైనికుడిగా.. రాజన్న వారసుడిగా నీతి నిజాయితీలతో నిబద్దతగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని.. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ఉండాలని రాజశేఖర్‌ రెడ్డి చూపించారని అన్నారు. తన గెలుపు ఖాయమైందని.. మే 23న విజయోత్సవం జరుపుకుందామని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఆళ్ల ధీమా చూస్తుంటే.. లోకేశ్ ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: