మరో కొత్త సర్వే వచ్చింది. న్యూ ఆంధ్రా సర్వే ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం విజయఢంకా మోగించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కూటమి మొత్తం 15 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసేసింది. టీడీపీ 14, ఒక స్థానం బీజేపీ గెలిచాయి. వైసీపీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో న్యూ ఆంధ్రా సర్వే ప్రకారం ఈ జిల్లాలో వైసీపీ - టీడీపీ మధ్య హోరా హోరీ పోరు కనిపిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో హోరాహోరీ పోరులో వైసీపీదే పై చేయి అయ్యింది. టీడీపీ 6 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందట. ఇక వైసీపీ 8 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందట. జనసేన ఈ జిల్లాలో ఒక స్థానం గెలుస్తుందట.
ఓవరాల్ గా చూస్తే ఈ సర్వే ప్రకారం .. వైసీపీ 101 సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటోందట. అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ 48 స్థానాలు గెలుచుకుంటుందట. ఇక గట్టి పోటీ ఇస్తుందని కలవరపెట్టిన జనసేన ఆరు స్థానాలు మాత్రమే సాధిస్తుందట. మరో 20 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది.