తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో తాను ఓటర్లను చైతన్యం చేయబట్టే పోలింగ్ శాతం పెరిగిందని చంద్రం సారు మళ్లీ ప్రగల్భాలకు పోతున్నారు..అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన వరుస ట్వీట్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో తాను ఓటర్లను చైతన్యవంతం చేయబట్టే పోలింగు శాతం పెరిగిందని చంద్రం సారు మళ్లీ చిటికెలేశారు.
ప్రభుత్వాధినేత అయి ఉండి ప్రతిదానికీ ప్రతిపక్షంపై నిందలు మోపడం మీకు సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ?స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా, సీఎస్ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష జరిపినా మాకేం సంబంధం. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో తాను ఓటర్లను చైతన్యవంతం చేయబట్టే పోలింగు శాతం పెరిగిందని చంద్రం సారు మళ్లీ చిటికెలేశారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో తాను ఓటర్లను చైతన్యవంతం చేయబట్టే పోలింగు శాతం పెరిగిందని చంద్రం సారు మళ్లీ చిటికెలేశారు.
తనను పని చేసుకోనిస్తే ఆ ఏడు ప్రాణాలు దక్కేవట. ప్రకృతిని హ్యాండిల్ చేసిన మొనగాడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన ఫిర్యాదు లేఖలో ప్రస్తావించిన కీలకాంశం ఇది. ప్రజల పరువు తీయమాకు స్వామీ! అని విజయసాయిరెడ్డి ట్వీట్లలో పేర్కొన్నారు.
సీఈవో ద్వివేది తన సమీక్షలకు అడ్డు చెప్పడం వల్ల పిడుగులు పడి రాష్ట్రంలో ఏడుగురు చనిపోయారట. తనను పనిచేసుకొనిస్తే ఆ ఏడు ప్రాణాలు దక్కేవట. ప్రకృతిని హ్యాండిల్ చేసిన మొనగాడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన ఫిర్యాదు లేఖలో ప్రస్తావించిన కీలకాంశం ఇది. ప్రజల పరువు తీయమాకు స్వామీ!
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 27, 2019