ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాల కోసం సుదీర్ఘ నిరీక్షణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. గెలుపు ఎవరిని వరిస్తుదో తెలియడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు సర్వేలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. 


తాజాగా ఇంటలిజెన్స్ పేరుతో ఓ సర్వే కలకలం సృష్టిస్తోంది. ఈ సర్వే ప్రకారం.. వైసీపీకి 115 స్థానాలు వస్తాయని తేలుతోంది. టీడీపీకి 59 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక మరో ప్రధాన పార్టీ జనసేనకు కేవలం ఒకే ఒక్క స్థానం వస్తుందని ఈ సర్వే చెబుతోంది. 

మొత్తం మీద వైఎస్ జగన్ కంఫర్టబుల్ మెజారిటీతో సీఎం కావడం ఖాయమని ఈ సర్వే చెబుతోంది. పవన్ కల్యాణ్ జనసేన కనీసం పది నుంచి ఇరవై స్థానాలు సాధిస్తుందని అంచనా వేసుకుంటుంటే..ఈ సర్వే మాత్రం కేవలం ఒకే ఒక్క సీటు వస్తుందని చెప్పడం విశేషం. 

ఐతే.. సోషల్ మీడియాలో ఎవరుపడితే వారు సొంత సర్వేలను తప్పుడు పేర్లతో సర్క్యులేట్ చేస్తున్నారన్న వార్తలూ వస్తున్నాయి. కాకపోతే.. ఉత్కంఠతో ఉన్న వారు ఏదో ఒక సమాచారం కోసం అంటూ వీటిని ఫాలో అవుతున్నారు. అసలు విషయం మే 23న కానీ తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: