ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మద్య హోరా హోరీ యుద్దం కొనసాగుతుంది. ప్రధాని పీఠం దక్కించుకునేందుకు ఇరు పార్టీ అధినేతలు నువ్వా అంటే నువ్వా అన్నట్లు ప్రచారాలు చేస్తున్నారు.
తాజాగా రాహూల్ గాంధీకి హోంమంత్రిత్వ శాఖ నోటీసులు. రాహూల్ పౌరసత్వంపై వివరన కోరిన హోంమంత్రిత్వ శాఖ . దీనిపై రాహూల్ గాంధీ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హోంశాఖ ఆదేశం.
రాహూల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి ఫిర్యాదు. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది. అంతే కాదు రాహూల్ నామినేషన్లను సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలయ్యింది.