అదేంటీ పిల్లిని హత్య చేయం ఏంటీ..పైగా ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసి దోషులను కఠినంగా శిక్షించమని కోరడం ఏంటా అని అశ్చర్యపోతున్నారు. నిజం..ఈ వింత సంఘటన విశాఖ పట్నంలో జరిగింది.  వివరాల్లోకి వెళితే..తన పెంపుడు పిల్లిని హత్య చేశారంటూ రైల్వే న్యూ కాలనీలోని రేవతి టవర్స్‌లో నివాసం ఉండే కటారి యశోద అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. 

తన పిల్లిని ఎదురింటి వారు దారుణంగా కొట్టి చంపేశారని అందువల్లే తన పిల్లి చనిపోయిందని..యశోద అనే మహిల పోలీసులకు ఫిర్యాదు చేసింది.   అంతే కాదు తన పిల్లిని చంపి వారిపై కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో యశోద కోరింది. 

అయితే బాధితులకు అండగా నిలిచింది విశాఖ సొసైటీ ఫర్ ప్రొటక్షన్‌ అండ్‌ కేర్‌ ఆఫ్‌ యానిమల్స్‌ సంస్థ. దీంతో కేసు నమోదు చేసిన విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు పోస్టుమార్టం నిమిత్తం పిల్లి మృతదేహాన్ని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.



మరింత సమాచారం తెలుసుకోండి: