యాదాద్రి జిల్లా బొమ్మల రామారం..హాజీపూర్ గ్రామంలో వెలుగు చూస్తున్న ఘటనలు  తెలుగు రాష్ట్ర ప్రజలను ఒకంత ఆందోళనకు గురి చేస్తున్నాయి.  అసలు మహిళలకు, అమ్మాయిలకు చివరకు చిన్నారులకు రక్షణ ఉందా లేదా అన్న అనుమానాలు తలెత్తున్నాయి.  హాజీపూర్ లో మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపి వారిని బావిలో పూడ్చి పెట్టే వాడు. వ్యవసాయ బావిలో అమ్మాయిల మృతదేహాలు లభ్యం కావడం.. మనీషా, శ్రావణి, కల్పన ను మాత్రమే కాకుండా చాలా మందినే శ్రీనివాస రెడ్డి చంపాడని భావిస్తున్నారు. 


శ్రావణిని హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని  గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే ఈ కేసు విచారణ చేసే సమయంలో  గ్రామానికి సమీపంలోని సీసీ టీవీ పుటేజీలో శ్రావణిని శ్రీనివాస్ రెడ్డి  తన బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు చిక్కాయి. ఈ దృశ్యాల ఆధారంగా శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.  ఈ విచారణలో శ్రీనివాస్ రెడ్డి శ్రావణిని హత్య చేసిన విషయాన్ని ఆయన ఒప్పుకొన్నారు.  ఇదే క్రమంలో గతంలో తాను చేసిన కల్పన, మనీషాల హత్యల గురించి కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. 


శ్రీనివాస్ రెడ్డిని అనుమానితుడిగా భావించి, విచారణకు తీసుకువెళ్లిన సమయంలో రాత్రిపూట ఇంటికి తాళం వేసి ఇంటి సభ్యులంతా వెళ్లిపోయారని..తమ ఆడపిల్లలను దారుణంగా చంపిన  ఆ మృగాన్ని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంటున్నారు. జీపూర్ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు.


శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం రాచకొండ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు శ్రీనివాస రెడ్డి ఇంటి వద్దకు వచ్చి, తాళం వేసివున్న ఇంటికి నిప్పంటించారు. తమ ఊరిలోనే తమ కళ్లముందే ఆ దుర్మార్గుడికి ఉరి వేయాలంటూ డిమాండ్ చేశారు.  రేపిస్టు శ్రీనివాస్ రెడ్డి ఇంకెందరు బాలికలను చంపేశాడోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: