తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమ్మాయిల వరుస హత్య కేసు విషయంలో మర్రి శ్రీనివాస్ రెడ్డి ని దోషిగా తేల్చారు.  శ్రావణి, మనీషా, కల్పన అనే ముగ్గురు బాలికలను శ్రీనివాస రెడ్డి పొట్టనబెట్టుకున్నాడు.  వారిపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు విచారణలో అంగీకరించాడు. 

తాను చేసిన నేరాలు అన్నీ ఒప్పుకున్న సైకో శ్రీనివాస్ రెడ్డి తనకు జరిగిన అవమానంతోనే ఆ ఊరి ప్రజలపై కక్ష పెంచుకొని అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి బావిలో పూడ్చి పెట్టానని పోలీసుల ఇంటరాగేషన్ లో ఒప్పుకున్నట్లు తెలిసింది.  శ్రీనివాస్ రెడ్డిని

పోలీసులు భువనగిరి కోర్టులో హాజరు పరిచారు. సైకో శ్రీనివాసరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ అతన్ని వరంగల్ సెంట్రల్ జైలుకి తరలించారు.

కాగా, హాజీపూర్ గ్రామస్థులు అతనికి జైలు శిక్ష విధించి..నామ మాత్రపు శిక్ష విధిస్తే..పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని..ఆ సైకో శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: