భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంట విషాదం నెలకొంది. ఆయన సహోదరుడు ప్రహ్లాద్ మోదీ భార్య భగవతి నేడు కన్నుమూశారు.  ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని నేడు ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 


భగవతి మృతదేహాన్ని సివిల్ ఆస్పత్రి నుంచి అహ్మదాబాద్ లోని వారి ఇంటికి తరలించారు. ఈ వార్త తెలుసుకున్న ప్రధాని మోదీ ఎంతో ఆవేదన చెందినట్లు తెలుస్తుంది. 


ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ప్రచారాంలో మునిగిపోయిన విషయం తెలిసిందే.  కాగా, భగవతి అంత్య క్రియలు అహ్మదాబాద్ లోని తల్తేజ్ లో జరగనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: