నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది భారత దేశ వ్యాప్తంగా మెడిసన్ విద్యార్థులకందరికీ నిర్వహించే పరీక్ష. వైద్య విద్య సీట్లు ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే ఇవ్వబడతాయి..ఈ పరీక్ష దేశం మొత్తం ఒకటేసారి జరుగుతుంది.
అయితే రైలు ఆలస్యంగా రావడం వలన కర్నాటకలోని విద్యార్థులు కొందరు NEET సమయానికి రాలేకపోయారు. దాంతో కొంత మంది ఆవేదనతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు.
తాజాగా NEET సమయానికి రాలేకపోయి..పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థలందరికీ తీపి కబురు అందించారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. NEET పరీక్షను రాసే అవకాశం కర్ణాటకలోని మిస్ అయిన విద్యార్థందరికీ కల్పిస్తామని ఆయన అన్నారు