నందిగామకు చెందిన ఓ టీడీపీ నేత చేసిన సర్వే ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈయన గత ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తన సర్వేలో చెప్పారు. అది నిజమైన నేపథ్యంలో తాజాగా సర్వే కూడా నిజం కావచ్చన్న అంచనాలు ఉన్నాయి. 


మరి ఇంతకీ ఈ టీడీపీ నేత సర్వే ఏం చెబుతుంది.. ఈయన సర్వేలో తేలిందేమిటంటే.. వైసీపీ 105 సీట్లతో అధికారంలోకి వస్తుందట. టీడీపీ 58 సీట్ల వరకూ సాధిస్తుందట. జనసేన పార్టికి మూడు సీట్ల వరకూ వస్తాయట. ఇదీ ఈయన సర్వే..

మొత్తం ఏపీలో 175 స్థానాలున్న సంగతి తెలిసిందే. మరో 9 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఒకవేళ ఆ మొత్తం సీట్లు టీడీపీకి వస్తాయని అనుకున్నా.. అధికారం మాత్రం వైసీపీకే వస్తుంది. 

ఒకవేళ ఆ 9 సీట్లలో వైసీపీ కనీసం సగం సీట్లు గెలుచుకున్నా.. ఆ పార్టీ 110 మార్కు అందుకుంటుంది. అయితే ఈ సర్వే బయటపెట్టిన నేపథ్యంలో ఆ నేతపై కూడా విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నుంచి వెళ్లిపోయినందుకే ఇలాంటి సర్వేలు ఇస్తున్నారని కూడా కొందరు విమర్శిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: