దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా..ఎన్ని నిర్భయ కేసులు నమోదు అవుతున్నా కొంత మంది కామాంధులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడమే..ఏముందిలే ఈ రోజు జైలుకి  వెళితే రేపు వస్తామన్న ధీమా ఇలాంటి నేరస్థులకు ఉండటంత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఓ ఆకతాయి ఓ మహిళ తన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విలపిస్తుంది.  వివరాల్లకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు 10 సంవత్సరాల క్రితం గుంటూరుకు చేరుకుని పనిచేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ నేపథ్యంలో వివాహిత స్నానం చేస్తుండగా, ఓ యువకుడు ఫోన్ లో రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. అంతటిత ఆగకుండా ఆ ఫోటో, వీడియోలు సదరు బాధితురాలికి చూపించి తన కోరిక తీరుస్తావా లేదా ఇవన్నీ వాట్సాప్, సోషల్ మీడియాల అప్ లోడ్ చేయమంటావా అని బెదిరించాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వివాహిత స్నానం చేస్తుండగా, ఓ యువకుడు ఫోన్ లో రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. దీనికి సదరు యువకుడి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు.

అయితే బయటకు చెబితే పరువు పోతుందన్న భయంతో వివాహిత ఈ విషయాన్ని భర్తకు కూడా చెప్పలేదు. నాలుగు రోజుల క్రితం సదరు యువకుడు మరోసారి వేధిస్తుండగా భర్త ఇంటికి రావడంతో విషయం బయటపడింది.  ఆ యువకుడు పదే పదే బెదిరించడంతో ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితురాలిని వెంటనే గుంటూరు జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. తనపై అఘాయిత్యానికి పాల్పపడిన యువకుడి చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని బాధితురాలి భర్త, బంధువులు ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ వైటీ నాయుడు పోలీసులను ఆదేశించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: