సెల్ఫీల కోసం కుర్రకారు పడే తాపత్రయం ప్రాణాల మీదకు తెస్తోంది. వాట్సప్ స్టేటస్ లో అప్డేట్ చేసేందుకో.. ఫేస్‌ బుక్‌లో పోస్టు చేసేందుకు సెల్ఫీల కోసం తాపత్రయపడటం ఇటీవల చాలా పెరిగింది. తాజాగా అలాంటి సెల్ఫీ కోసం తాపత్రయపడిన ఓ తెలుగమ్మాయి గోవా బీచ్‌లో శవమై తేలింది
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఊటుకూరు రమ్యకృష్ణ వృత్తిరీత్యా డాక్టర్. ఇటీవలే ఆమె గోవాలో ప్రభుత్వ అనుబంధ వైద్యసంస్థలో చేరారు. మంగళవారం సాయంత్రం సరదాగా బీచ్ కు వెళ్లిన రమ్య కృష్ణ.. ఓ సెల్ఫీ తీసుకుందామని సముద్రంలోకి వెళ్లారు.  

సెల్ఫీ సందడిలో సరిగ్గా చూసుకోలేదో ఏమో.. అలల్లో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. రమ్యకృష్ణ స్వస్థలం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. ఆమెకు తల్లి, సోదరులు, ఓ సోదరి ఉన్నారు. పదేళ్ల క్రితం వరకూ ఆమె జగ్గయ్యపేట హెల్త్ సెంటర్ లో వైద్యురాలిగా సేవలందించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: