ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖచ్చితంగా అవసరమని చెప్పాలి. ఎందుకంటే పార్టీ అధికారంలో రాకపోతే చంద్రబాబు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక, వయసు ఉండదు. అయితే చంద్రబాబు నాయుడు టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోన్న విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ లక్ష్యంగా ట్వీట్లు ఎక్కుబెట్టారు. మే 23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుందని ఆయన ట్వీట్ చేశారు.


ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుందని ఆయన అంచనా వేశారు. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు చేశాడని ఎద్దేవా చేశారు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నామని విజయసాయి తెలిపారు. ఎన్నికల సంఘం ఏపీలో మరో ఐదు చోట్ల ఉప ఎన్నికలు నిర్వహిస్తుండటం పట్ల టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.


ఈ విషయం పట్ల విజయసాయి స్పందించారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటర్లకు బదులు ఒక మహిళా అధికారి తానే తృణమూల్ గుర్తు బటన్ నొక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చంద్రబాబుకు కనిపించలేదా? ఎలక్షన్‌ కమిషన్‌ మెతగ్గా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో ఇదే తరహా రిగ్గింగుకు పాల్పడేవాడు కాదా?’ అని ఆయన ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: