ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి.  ఏ ఫలితాలు చూసుకున్న ఆంధ్రప్రదేశ్ లో వైకాపాకు అనుకూలంగా ఉన్నట్టు చూపిస్తున్నాయి.  సిపిఎస్ సర్వే ప్రకారం వైకాపా 130 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉండగా, తెలుగు దేశం పార్టీ 40 నుంచి 43 వరకు గెలుచుకుంటుందని చెప్పగా, జనసేన పార్టీ 1 స్థానంలో మాత్రమే గెలుచుకుంటుందని చెప్తోంది.  


ఈ సర్వేను బట్టి చూస్తే వైకాపా ఆంధ్రప్రదేశ్ లో స్వీప్ చేస్తుందని చెప్తోంది.  సర్వే ప్రకారం స్థానాలు రాకపోయినా... అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీ సీట్లు మాత్రం పార్టీ గెలుచుకోగలుగుతుందని మరికొన్ని సర్వేలు చెప్తున్నాయి.  


నిన్న లగడపాటి ఇచ్చిన సర్వేల ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.  కానీ, ఇప్పుడు అందుతున్న సర్వేలు వైకాపాకు అనుకూలంగా ఉండటం విశేషం.  ఈ సర్వే ఫలితాలే తుది ఫలితాలు వస్తాయా అన్నది తెలియాలంటే మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: